ఎమ్మెల్యే కూనం‌నేని సాంబశివరావుపై కేసు నమోదు

73చూసినవారు
ఎమ్మెల్యే కూనం‌నేని సాంబశివరావుపై కేసు నమోదు
పార్లమెంట్ ఎన్నికల వేళ సీపీఐకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకి కూనంనేనిపై ఫిర్యాదు చేశారు. పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎంపీడీవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్ పెట్టడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్