గోవాలో అయిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారు. వాస్కో వద్ద నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 20 మందిని విచారిస్తున్నారు. వాడెం ప్రాంతంలో ఉన్న నిర్మాణ ప్రదేశంలో ఆ చిన్నారి శుక్రవారం ఉదయం అపమారక స్థితిలో కనిపించింది. అయితే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లిన సమయంలో ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. ఎస్పీ సునితా సావంత్ ఈ అంశంపై మీడియాకు వెల్లడించారు.