చైనాలో యాంజియో నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ భవనంలో బుధవారం ఉదయం జరిగిన గ్యాస్ పేలుడు కారణంగా బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాలు కార్లపై పడ్డాయి. ఆ భవనంలోన
ి రెస్టారెంట్లో గ్యాస్ లీకేజే దీనికి కారణమని తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రుల వివరాలపై క్లారిటీ రాలేదు. పేలుడు దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్లో పేలుడు సంభవించిందని ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది.