రూ.57 కోట్లకు అమ్ముడుబోయిన 14వ శతాబ్దం అరుదైన బైబిల్

78చూసినవారు
రూ.57 కోట్లకు అమ్ముడుబోయిన 14వ శతాబ్దం అరుదైన బైబిల్
క్రైస్తవుల పవిత్ర బైబిల్ గ్రంథాన్ని చాలా వరకు ఉచితంగానే అందిస్తుంటారు. అయితే ఓ బైబిల్ రూ.57 కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పుకోవాలి. దీన్ని 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్ రాశారు. 1312వ సంవత్సరంలో స్పెయిన్ లోని సోరియా ప్రాంతంలో ఈ 800 పేజీల పుస్తకం పూర్తి చేశారు. న్యూయార్క్ లోని సోథెబైస్ వేలం హౌస్ లో ఈ పురాతన బైబిల్ 69 లక్షల డాలర్లకు(రూ.57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది.

సంబంధిత పోస్ట్