సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయినిగూడెం వద్ద కారు చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కేతేపల్లికి చెందిన సాయి (17), నవీన్ (20)గా గుర్తించారు. ప్రమాదం జరగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.