దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా మార్చేందుకు దూరదృష్టితో ఈ బడ్జెట్ను రూపొందించారని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 2024-25 బడ్జెట్పై ఆయన స్పందించారు. బడ్జెట్లో ప్రకటించిన మధ్యతరగతి కోసం గృహనిర్మాణ పథకం ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పారు. ‘లఖ్పతి దీదీ’ లక్ష్యాన్ని 3కోట్లకు పెంచారని, ఈ బడ్జెట్లో పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగాలపై దృష్టి సారించారని ఆయన తెలిపారు.