జార్ఖండ్లో సీఎం సోరేన్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంపై సోరేన్ను ఎన్నుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదని తెలుస్తోంది. దాంతో రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న
కాంగ్రెస్, జేజేఎం, ఆర్జేడీ పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని
కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.