యూపీలోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో ఉన్న ఆలయంలో పూజలు మొదలయ్యాయి. పురోహితుడు పూజలు చేస్తోన్న వీడియోను హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ట్వీట్ చేశారు. హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు నిన్న తీర్పునిచ్చింది. కాగా, 30 ఏళ్ల తర్వాత ఇవాళ ఉదయం తొలి పూజ ప్రారంభమైంది.