ఆధార్- రేషన్ కార్డ్ అనుసంధానం గడువు పెంపు

76చూసినవారు
ఆధార్- రేషన్ కార్డ్ అనుసంధానం గడువు పెంపు
ఆధార్-రేషన్ కార్డ్ ను లింక్ చేయని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024 జూన్ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకొనేందుకు ఆధార్- రేషన్ కార్డ్ ను లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. ఇప్పటికే చాలామంది ఆధార్ అనుసంధానం పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్