దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిని విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం సహా తదితర హామీలు ఇందులో ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పతుల్లో ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.