TG: మేడ్చల్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్కు చెందిన ఓ విద్యార్థిని.. స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ అందరి ముందు అవమానించాడు. అవమాన భారం తట్టుకోలేక సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్కూల్పై ABVP, SFI సంఘాలు దాడి చేసి.. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. అనంతరం విద్యార్థినికి న్యాయం చేయాలంటూ స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు.