శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు

582చూసినవారు
శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆక్రమాస్తుల కేసు దర్యాప్తులో ACB దూకుడు పెంచింది. శుక్రవారం రెరా ఆఫీసులో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 3 రోజుల కస్టడీలో వందల డాక్యుమెంట్లపై ఆరా తీసి.. లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలను గుర్తించింది. అక్రమ సంపాదనను బంగారం, భూముల రూపంలోకి మార్చినట్లు నిర్ధారణకు వచ్చింది. బినామీల పేర్లతో లాకర్లలో పలు పాస్ బుక్స్ బయటపడటంతో వారందరికీ ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్