కమల్హాసన్ -మణిరత్నం కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే. ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్పోర్టులో వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హెలికాప్టర్ జంపింగ్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. కాగా, జార్జ్.. స్టిక్ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరలవుతోంది.