జనాలకు సోషల్ మీడియా పిచ్చి రోజు రోజుకు ఎక్కువైపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. బస్సు కింద ఓ యువకుడు పడుకున్నట్లు వీడియో వైరల్ అవ్వడం తెలిసిందే. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలను TGSRTC యాజమాన్యం సీరియస్గా తీసుకుంటోంది’’ అని ట్వీట్ చేశారు.