ప్రపంచ యోగా గురువుగా భారత్ అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు. భారత్ చేసిన కృషి వల్లే 2015 నుంచి యోగాకు అంతర్జాతీయ ప్రాశస్త్యం లభించిందని తెలిపారు. యోగా అనేది ఇప్పుడొక దైనందిన కార్యక్రమంగా మారిందని పేర్కొన్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.