IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం RCBతో జరిగిన మ్యాచ్లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలైనప్పటికీ చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్సర్లు మాత్రం ఫ్యాన్స్కు ఆనందాన్ని ఇచ్చాయి. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్స్లు బాది ఫ్యాన్స్లో జోష్ నింపారు.