బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన అపార్ట్మెంట్లో మరణించి 4 ఏళ్ళు గడిచాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సుశాంత్ నివసించిన అపార్ట్మెంట్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి . ఇప్పుడు అదే ఇంటిని ప్రముఖ హీరోయిన్ అదా శర్మ కొనుగోలు చేసింది. అదా శర్మ ఇంటిని మొత్తం రీడిజైన్ చేయించింది. గత కొన్ని రోజులుగా అక్కడే నివసిస్తున్న అదా శర్మ.. కొత్త ఇంట్లో పాజిటివ్ వైబ్ని అనుభవిస్తున్నాను అని చెబుతుంది.