ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, శాఖ ద్వారా నిర్వహించబడుతున్న వసతిగృహాల వివరాలను తెలిపే కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, ఈడీ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.