ఈనెల 22న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ గ్రౌండ్ లో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్న సభా స్థలాన్ని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సందర్శించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధాన వేదిక, జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాలను నియోజకవర్గ ఇంఛార్జీలను అడిగి తెలుసుకున్నారు.