ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

535చూసినవారు
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ ఏరియాలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు టూ టౌన్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 3030 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ అశోక్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ రమణారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమణ, సిబ్బంది నరేష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్