కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట్ గ్రామానికి చెందిన బోగారం బీంరావు (30) ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్టు స్తానికులు తెలిపారు. సోమవారం స్తానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. మృతునికి కూతురు, కుమారుడు బార్య అన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.