ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

80చూసినవారు
ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి
గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్ తో కలిసి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ మళ్లీ నరేంద్రమోదీని ప్రధాని చేయడమే లక్ష్యంగా బిజెపికు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్