కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తాంసి మండలం కప్పర్ల గ్రామంలో సోమవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆడే గజెందర్ లతో కలిసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ దేవుడు గుడి లో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. పెద్దోళ్ల బతుకులు మార్చే కాంగ్రెస్ పార్టీ మీ మది లో ఉండాలన్నారు.