ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం: కోదండరాం

75చూసినవారు
ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం: కోదండరాం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ సంఘ భవనంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొన్నారని, ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సముచిత స్థానం కల్పించేలా చూస్తానన్నారు.

సంబంధిత పోస్ట్