తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఆయన సతీమణి సునీత, తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డితో పాటు నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు.