దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా కొనుగోళ్లతో సూచీలు కళకళలాడుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మళ్లీ 22 వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్లో విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.