అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మృతి

64చూసినవారు
అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి చేరిన గర్భిణీ పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు గర్భిణీ కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించి 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చి.. గర్భిణీని తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది.

సంబంధిత పోస్ట్