ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్రావుతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. వ్యాపార వేత్త చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గతంలో యూపీలో హెల్త్కేర్ సెంటర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి డైరెక్టర్లతో కలిసి కంపెనీని స్వాధీనం చేసుకోవాలని చూశాడని.. తాను ఒప్పుకోకపోవడంతో డీసీపీ, పలువురి సాయంతో కిడ్నాప్ చేయించారని తెలిపారు.