గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని సచిన్ ఏరియాలో ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రాణనష్టానికి సంబంధించి వివరాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఒక మహిళను శిథిలాల నుంచి బయటికి తీశామని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు.