ఏపీ సీఎంపై దాడి.. స్పందించిన భట్టి విక్రమార్క

59685చూసినవారు
ఏపీ సీఎంపై దాడి.. స్పందించిన భట్టి విక్రమార్క
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచివి కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్