రామ్‌లల్లా వెండి నాణెం విడుదల

55చూసినవారు
రామ్‌లల్లా వెండి నాణెం విడుదల
అయోధ్యలో కొలువైన రామ్‌లల్లా భక్తులకు గుడ్‌న్యూస్. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం ధర రూ.5,860. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్‌లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్