సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి: హరీశ్ రావు

73చూసినవారు
సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి: హరీశ్ రావు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. 'ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుని, వారితో మా పార్టీ MLAలపై దాడులు చేయిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. రేవంత్ వెంటనే కౌశిక్ కు క్షమాపణ చెప్పి, పూర్తి భద్రత కల్పించాలి' అని డిమాండ్ చేశారు. కాగా హరీష్ రావు సిద్దిపేట నుంచి కౌశిక్ నివాసానికి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్