తెలంగాణలో ఈ ఏడాది 4.97 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానునుండడంతో, శుక్రవారం నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆయా పరీక్ష తేదీల్లో ప్రతి రోజు ఉ.9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.