రాష్ట్రంలో 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్‌ హోదా

61చూసినవారు
రాష్ట్రంలో 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్‌ హోదా
తెలంగాణలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్‌ హోదా దక్కింది. న్యాక్‌ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోధన్‌, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కరీంనగర్‌కు అటానమస్‌ హోదా కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోదాడకు కూడా అటానమస్‌ హోదా దక్కాల్సి ఉంది. అయితే చిన్న కారణంతో ఇది నిలిచినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్