ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 67 పరుగులకు ఔట్ అయ్యారు. అవేష్ ఖాన్ బౌలింగ్లో 16.1 ఓవర్కు సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ వెనుదిరిగారు. సూర్య వికెట్ తనకు దక్కడంతో అవేష్ ఎంతో సంబరపడ్డారు.దీంతో 17 ఓవర్లకు MI స్కోర్ 164/4గా ఉంది.