తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న విద్యార్థి వినయ్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం సీఎంఆర్ కళాశాలలో చదువుతున్న వినయ్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.