షామ్లీ మునిసిపాలిటీ బోర్డు మీటింగ్లో నాయకులు, అధికారులు తీవ్రంగా ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మీటింగ్ లో అవినీతిపై తీవ్ర ఆరోపణలు తలెత్తడంతో గొడవ జరిగిందని సమాచారం. పోలీసుల ఎదుటనే ఘోరంగా తన్నుకున్నారు. దీంతో షామ్లీ మున్సిపాలిటీలో బోర్డు సమావేశం రణరంగంగా మారింది. ప్రస్తుతం, సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.