మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా బజరంగ్ఘర్ వంతెన వద్ద శనివారం షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న ట్రక్కులో నుంచి కొన్ని బస్తాలు జారిపోయాయి. అదే సమయంలో ట్రక్కు పక్క నుంచి వెళ్తున్న బైక్పై ఆ బస్తాలు పడ్డాయి. దీంతో బైక్పై భర్తతో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళ గాయపడింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.