కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి శాంతినగర్, మల్లేశ్వరం, రిచ్మండ్ సర్కిల్, మహదేవపురాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వీధులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు, నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.