నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం 9 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.