ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో 9 అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.20వేలు అందించడంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రం పీఎంకిసాన్ పథకం నిధులు విడుదల చేయగానే.. రాష్ట్ర నిధులు కలిపి, రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది.