ప్రస్తుత ఎన్నికలు ప్రజల ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ అన్నారు. "జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే. బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. బాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం." అని పలమనేరు సభలో సీఎం చెప్పారు.