భారతదేశ స్వాతంత్య్ర కోసం పోరాడిన పార్సీ వనిత భికాజీ రుస్తుం కామా. ఈమె స్వాతంత్య్ర సమరయోధురాలు మాత్రమే కాదు. లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవితకాలమంతా పోరాడిన మహిళ. 1906లో జర్మనీలోని స్టుట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ఈమె భారత జెండాను ఎగురవేశారు. భారత స్వాతంత్రోద్యమ కర్త శాయాంజీ కృష్ణ వర్మ చేత ప్రభావితమై, 1901లో దాదాభాయ్ నౌరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీ స్థాపించారు.