బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను గురువారం పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ వేడుకకు కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.