బీఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. 'ఇన్స్ట్రక్టర్ గ్రేడ్' పొందారు. 2021లో బీఎస్ఎఫ్లో చేరిన కుమారి.. పంజాబ్లో ఓ ప్లటూన్కు నాయకత్వం వహిస్తున్నారు. 8 వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం.