బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ బహిరంగ సభ ఈ నెల 6న జరుగనుంది. మే 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మేకల అభినవ స్టేడియం, గొల్లగూడ,నల్గొండ పట్టణంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు,కార్యకర్తలు తరలివచ్చి భరోసా కల్పించాలని శానంపూడి సైదిరెడ్డి కోరుకున్నారు.