పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. వీడియో వైరల్

74చూసినవారు
పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పాక్ సైనికులు బస్సులో క్వెట్టా నుంచి తఫ్తాన్ వెళ్తుండగా దాడి చేయడంతో దాదాపు 7 మంది మరణించగా 23 మంది గాయపడ్డారు. పాక్, బలూచ్ వేర్పాటువాదుల మధ్య పోరు తీవ్రంగా మారడంతో పాక్‌ ఇప్పటికే భారీగా నష్టపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్