భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను రెండు గంటల ముందే ముగించారు. ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(6*), మొమినుల్ హక్(40*) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.