ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 24న ఓ అమ్మాయి, అబ్బాయికి ఘనంగా పెళ్లి జరిగింది. మరుసటి రోజు వధువును అత్త మామల ఇంటికి పంపారు. ఫిబ్రవరి 26న అందరికీ టీ అందించి.. అంతలోనే గట్టిగా పొట్ట నొప్పి అని కేకలు వేసింది. కుటుంబ సభ్యులు భయపడి ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు తొమ్మిది నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్కు అయ్యారు.