TG: కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అధిక్యం సాధించారు. మెదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,712, కాంగ్రెస్కు 6,676, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల ఫలితాల్లో అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, హరికృష్ణ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది.